రాష్ట్రంలో ఆకస్మిక విజిలెన్స్ దాడులు

15 May, 2015 02:01 IST|Sakshi

రూ.16.64 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు సీజ్

హైదరాబాద్: అక్రమంగా నిల్వ ఉంచిన విత్తనాలు, ఇతర నిత్యావసర వస్తువుల గోడౌన్లపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంటు శాఖ గురువారం దాడు లు జరిపి రూ.16.64 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసింది.

అన్ని జిల్లా ల్లో ఏకకాలంలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్ డీలర్ల గోడౌన్లు, ట్రాన్స్‌పోర్టు కంపెనీలపై దాడులు జరిపి  32 కేసులతోపాటు ఒక క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు విజి లెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జనరల్ టి.పి.దాస్ తెలిపారు. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే రూ.13 లక్షల విలువైన సామగ్రి లభించిందని చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు