ముందుగానే వేసవి సెలవులు?

5 Mar, 2015 03:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలకు ఈసారి వేసవి సెలవులను ముందుగానే ప్రకటించాలని ప్రభుత్వ వర్గాలు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.  ఇప్పటివరకు ఉన్న షెడ్యూలు ప్రకారం పాఠశాలలకు ఏప్రిల్ 23 చివరి పనిదినం కాగా జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే దీనివల్ల రాష్ట్ర అవతరణదిన వేడుకలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే ఏప్రిల్ 12 నుంచి మే చివరి వరకు వేసవి సెలవులను ఇవ్వాలని, జూన్ 1న పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు.
 

మరిన్ని వార్తలు