మూడు స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు: చాడ

31 Mar, 2019 02:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈ స్థానాల్లో పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి (మల్కాజిగిరి), పొన్నం ప్రభాకర్‌ (కరీంనగర్‌), వంశీచంద్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌) తమ పార్టీ మద్దతు కోసం సంప్రదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పోటీ చేస్తున్న 4 సీట్లలో పరస్పరం సహకరించుకుంటామన్నారు. మిగతా చోట్ల బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఓడించగలిగే లౌకిక పార్టీల అభ్యర్థులకు మద్దతునివ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇత ర స్థానాల్లో ఎవరికి మద్దతునివ్వాలనే దానిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. కాగా, ఆదివా రం అల్వాల్‌లో లోక్‌సభ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు బాలమల్లేశ్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు