మైసమ్మ సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

29 Dec, 2019 02:29 IST|Sakshi

కడ్తాల్‌: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలంలో వెలసిన మైసిగండి మైసమ్మ తల్లిని శనివారం సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధి కారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో స్నేహలత, ట్రస్టీ చైర్మన్‌ శిరోలీ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు