'స్వామిగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌లకు మంత్రి పదవులు'

22 May, 2014 15:49 IST|Sakshi
'స్వామిగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌లకు మంత్రి పదవులు'

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన స్వామిగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌లకు మంత్రి పదవులు అలంకరించబోతున్నారు. వీరిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగులు లేని తెలంగాణ ఉద్యమమే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. తమది ఉద్యోగ అనుకూల ప్రభుత్వం తమదని చెప్పుకున్నారు.

ఆంధ్రా ఉద్యోగులు, ఆంధ్ర ప్రభుత్వంలో ఉండాలని కొద్ది మందిని బలవంతంగా రుద్దినా ఉండనీయబోమని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులను అనుమతించమని చెప్పారు. ఈ విషయంలో తమ స్పేచ్ఛను హరిస్తే ఊరుకోబోమని, కొట్లాకైనా సిద్దమని అన్నారు. ఆంధ్రా ఉద్యోగులను సచివాలయం గేటులోపలికి కూడా అనుమతించమని కేసీఆర్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు