ప్రాణాలు తీసిన ఈత సరదా..

12 Oct, 2017 02:57 IST|Sakshi
సంధ్య, మంజుల, పెద్ద మంజుల మృతదేహాలు

నీటికుంటలో పడి నల్లగొండ జిల్లాలో ముగ్గురు చిన్నారుల మృతి 

దామరచర్ల (మిర్యాలగూడ): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాచ్యా తండాలో ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను తీసింది. తండాకు చెందిన లావూరి రవి, సరోజల పెద్ద కూతురు సంధ్య (13) కట్టంగూరు మండలం అయిటిపాముల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మరో కూతురు మంజుల (8) స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఇదే తండాకు చెందిన లావూరి లింగా, శారదల కూతురు పెద్దమంజుల (12) అయిటిపాముల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరతగతి చదువుతోంది. ముగ్గురూ ప్రాణస్నేహితులు.

తల్లిదండ్రులు పొలానికి వెళ్తుండగా సంధ్య, మంజులలు వారితో కలసి పొలానికి వెళ్లారు. తల్లిదండ్రులు కుంట సమీపంలోని పొలాల్లో చెట్లు కొట్టుకుంటుండగా, వీరు ముగ్గురు సరదాగా ఈతకోసం నీటి కుంటలో దిగారు. ఇటీవల వచ్చిన వర్షాలకు కుంటలోకి భారీగా నీరు చేరడంతో మగ్గురూ మునిగిపోయారు. రాత్రి అయినా పిల్లలు రాకపోవడంతో కుటుంబీకులు బావి, కుంట దగ్గర వెతికారు. కుంట దగ్గర చున్నీలు, చెప్పులు కనిపిం చడంతో నీటిలో దిగి వెతకడంతో ముగ్గురు బాలికల మృతదేహాలు కనిపించాయి.  
 

మరిన్ని వార్తలు