హైదరాబాద్ : హైదరాబాద్ ప్రజలను స్వైన్ఫ్లూ వణికిస్తోంది. రోజురోజుకీ స్వైన్ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు భయం పుట్టిస్తోంది. గత మూడు రోజుల్లోనే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ఫ్లూతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 12 మంది చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో నెలకొన్న చలితీవ్రతతో స్వైన్ఫ్లూ మరింత వ్యాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.