కుంతియా సమక్షంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ

12 Jun, 2015 21:49 IST|Sakshi
కుంతియా సమక్షంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ

హైదరాబాద్: పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో హైకమాండ్ పరిశీలకుడు కుంతియా సమక్షంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నేతుల చర్చించారు. అదే విధంగా కేసీఆర్ ఫిరాయింపులపై ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానిని కలిసే అంశంపై టీ కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడినట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లటం వల్ల ఏం ప్రయోజనం లేదని జానారెడ్డి అన్నారు. ఆదివారం మరోసారి భేటీ అయి చర్చించుకుందామని ఇతర సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు