'దళితులపై దాడులు అరికట్టాలి'

23 May, 2015 19:36 IST|Sakshi
'దళితులపై దాడులు అరికట్టాలి'

సంగారెడ్డి(మెదక్ జిల్లా): దళితులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఫ్లెక్సీకి శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ దళితులపై దాడులు చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని, అట్రాసిటి కేసులను నీరుగారుస్తున్న సంగారెడ్డి, రామచంద్రపురం డీఎస్పీలను సస్పెండ్ చేయాలని, సంగారెడ్డి జడ్పీటీసీ మనోహర్‌గౌడ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు