- టీఆర్ఎస్ నాయకుడు కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల: బంగారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్కే సాధ్యమని బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత, టీఆర్ఎస్ నాయకుడు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ సభ కోసం నియోజకవర్గంలో వివిధ గ్రామాలనుండి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం కడ్తాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నారాయణరెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పాలన జనరంజకంగా సాగుతుందని తెలిపారు.
వాటర్గ్రిడ్, మిషన్కాకతీయ, షాదీ ముబారక్, కలాణలక్ష్మి, పేద ప్రజలకు పింఛన్ల పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యులం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీసింగ్, ఉప్పల వెంకటేశ్, బండెల రాంచంద్రరెడ్డి, తులసీరాం, వెంకట్రామిరెడ్డి, వెంకట్రెడ్డి, కేశవరెడ్డి,హాన్మానాయక్, క్రిష్ణారెడ్డి,రఘురాములు, భాస్కర్రెడ్డి, జహంగీర్అలీ తదితరులు పాల్గొన్నారు.