పౌరసత్వ బిల్లుతో అనిశ్చితి: తపన్‌సేన్‌

16 Dec, 2019 03:19 IST|Sakshi

మల్లాపూర్‌: దేశ విభజన దిశగా బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును తీసుకువచ్చిందని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ఆరోపించారు. ఈ బిల్లు వల్ల దేశంలో అనిశ్చితి వాతావరణం నెలకొందని మండిపడ్డారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు ఆదివారం మల్లాపూర్‌ వీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తపన్‌సేన్‌ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం సమాజాన్ని, దేశాన్ని విభజించే దిశగా అడుగులు వేస్తోందని విమర్శించారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సహా పలు విషయాల్లో ఒంటెత్తు పోకడలకు పోయి దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌రావు, చుక్కా రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు