వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ వంద రోజుల్లో వెయ్యి అబ ద్ధాలు ఆడారని, ప్రజలకు సరైన రీతిలో మేలు చేయలేకపోయూరని టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయూకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా తాడ్వారుు మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మను ఆదివారం టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పలువురు దర్శించుకున్నారు.
వనదేవతలకు పూజలు నిర్వహించిన అనంతరం దయూకర్రావు మాట్లాడుతూ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడం, తెలంగాణలో చాలామంది ఎమ్మెల్యేలు తమ పార్టీ తరఫున గెలిచిన సందర్భంగా దేవతలను దర్శించుకున్నట్లు తెలిపారు. సీఎం హామీలను నెరవేర్చాలని వేడుకున్నట్లు చెప్పారు.