నల్గొండలో టీడీపీ రాస్తారోకో

1 Jun, 2015 10:58 IST|Sakshi

నల్గొండ జిల్లా: నల్లగొండ జిల్లాలోని చర్లపల్లి వద్ద సోమవారం ఉదయం టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. నల్గొండ టీడీపీ అసెంబ్లీ ఇంచార్జి కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలంటూ ధర్నాకు దిగారు.

మరిన్ని వార్తలు