కేటీపీఎస్‌లో ఉత్పత్తికి అంతరాయం

29 Dec, 2015 12:19 IST|Sakshi
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం పదో యూనిట్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో 250 మెగావాట్ల యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తి ఉత్పత్తి నిలిచి పోయింది. వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతులకు ఉపక్రమించారు.
 
మరిన్ని వార్తలు