పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం పదో యూనిట్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో 250 మెగావాట్ల యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తి ఉత్పత్తి నిలిచి పోయింది. వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతులకు ఉపక్రమించారు.