చేపల వేటకు వెళ్లి బాలుడు గల్లంతు

28 Dec, 2015 16:56 IST|Sakshi

శామీర్‌పేట్ (రంగారెడ్డి) : చేపల వేటకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం మలక్‌పేట్ చెరువు వద్ద సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మధు(17) అనే బాలుడు చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు