ఈ నెల 16న తెలంగాణ అఖిలపక్ష సమావేశం

9 Dec, 2014 19:54 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16న ఈ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ అఖిల పక్ష సమావేశం జరిగింది. నాలుగున్నర పాటు సాగిన ఈ భేటీలో హైదరాబాద్ సంబంధిత అంశాలపై చర్చించారు. కాగా హైదరాబాద్ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. గణేష్ నిమజ్జనానికి విడిగా వినాయక్సాగర్ నిర్మాణాన్ని బీజేపీ వ్యతిరేకించింది. హుస్సేన్ సాగర్లోని గణేష్ నిమజ్జనం చేయాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు