పాఠశాలల పరిస్థితులు మెరుగుపర్చాలి: జితేందర్

28 Nov, 2014 01:37 IST|Sakshi
పాఠశాలల పరిస్థితులు మెరుగుపర్చాలి: జితేందర్

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని అనేక పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేనందున కేంద్రం తగినన్ని నిధులు మంజూరు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. గురువారం ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు.

450 నుంచి 600 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ ఆయా పాఠశాలల్లో గదులు మాత్రం ఒకటీ రెండే ఉంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గదుల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
 

మరిన్ని వార్తలు