27 నుంచి తెలంగాణ అసెంబ్లీ

17 Oct, 2017 14:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు ఈ నెల27నుంచి ప్రారంభం కానున్నాయి. 15 నుంచి 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26న బీఏసీ సమావేశంలో షెడ్యూల్‌ ఖరారు కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీలో అన్ని అంశాలపై కులంకషంగా చర్చ జరగాలన్నారు. ప్రతిపక్షాలు ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సభలో ప్రతిపక్షాలు ఏ అంశంపై ప్రశ్నించినా జవాబు చెప్పేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. సభ హుందాగా నడవాలని, ప్రతి అంశంపై చర్చ జరగాలని సీఎం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు