1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆమోదం!

12 Jul, 2019 22:20 IST|Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణలోని బీసీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బీసీ గురుకులాల్లో ఖాళీల భర్తీకి త్వరలో నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీ గురుకుల విద్యాలయాల్లో 1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన వాటిలో ప్రిన్సిపల్‌(36), టీజీటీ(1,071), పీఈటీ(119), ఇతర పోస్టులు(472) ఉన్నాయి. గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు ఈ పోస్టులను త్వరలో భర్తీ చేయనుంది. దీనికనుగుణంగా ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.  

మరిన్ని వార్తలు