‘సెక్రటేరియట్‌ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించండి’

24 Mar, 2020 16:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఖాళీగా ఉన్న తెలంగాణ సెక్రటేరియట్‌ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా (కొవిడ్‌​-19) బాధితుల సంఖ్య అధికంగా పెరిగినట్లయితే, సెక్రటేరియట్ ఖాళీగా ఉన్నందున ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు బండి సంజయ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు