నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎస్

27 Jun, 2015 09:34 IST|Sakshi

హైదరాబాద్: ఢిల్లీలో శనివారం జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి పి ఆచార్యలు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధులుగా వీరిద్దరూ హాజరవుతున్నారు.

 

కేంద్ర ప్రాయోజిత పథకాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉప కమిటీ ఆఖరి సమావేశం కావటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ రెండో వారంలోనే జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడింది. అప్పుడు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ ఈసారి  మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు