డప్పు పట్టి దరువేసిన డిప్యూటీ సీఎం

29 Dec, 2014 09:33 IST|Sakshi
డప్పు పట్టి దరువేసిన డిప్యూటీ సీఎం

కరీంనగర్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య ఉత్సాహంగా దరువేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.రాజయ్య ఆదివారం డప్పు పట్టుకుని దరువేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వారధి ఛైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని డప్పు వాయించారు. వీరితో పాటు మరో ఎమ్మెల్యే బొడిగె శోభ కూడా పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు