రేపే బడ్జెట్‌ : హరీష్‌రావు తొలిసారి

7 Mar, 2020 17:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శాసనసభలో 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చజరుగుతోంది. ఇక కీలకమైన రాష్ట్ర బడ్జెట్‌ రేపు (ఆదివారం) సభ ముందుకు రానుంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్‌రావు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి విత్తమంత్రి హోదాలో ఆయన సభలో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. కాగా రెండోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణలో కీలకమైన ఆర్థికశాఖను హరీష్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి హోదాలో గత ఏడాది బడ్జెట్‌ను కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలిలో రేపు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ సమర్పించనున్నారు. (సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు)


 

మరిన్ని వార్తలు