సీమాంధ్ర వైద్యులు వెళ్లిపోవాల్సిందే: టీజీజీడీఏ ‘గాంధీ’ యూనిట్

28 Aug, 2014 00:34 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సీమాంధ్ర వైద్యులంతా వారి స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రిలో బుధవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్, సిద్దిపేట రమేష్‌లు తెలిపారు. సమావేశ అనంతరం టీజీ జీడీఏ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు