'విద్యతోనే గిరిజనుల అభివృద్ధి'

5 Sep, 2015 16:35 IST|Sakshi

మంచాల (రంగారెడ్డి) : విద్యతోనే గిరిజనులు అభివృద్ధి చెందుతారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రామచంద్రుడు అన్నారు. ఆయన శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని ఐపీఎఫ్ స్కూల్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పలు విషయాలు మాట్లాడారు. ఓ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్కూల్‌కు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వ అధికారులతో చర్చిస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు