ఆదాయార్జనే ప్రధానంగా మద్యం విక్రయాల లైసెన్స్లు
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
దుకాణాలను ఆరు శ్లాబులకు పెంచిన సర్కారు
మొదటి నాలుగు శ్లాబుల్లో లైసెన్స్ ఫీజు పెంపు
ఫీజు చెల్లించేందుకు 4 వాయిదాల్లో అవకాశం
లైసెన్స్ ఫీజుకు ఏడింతలు అమ్ముకునే వెసులుబాటు
ఖజానాకు రూ.2,320 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా మద్యం విక్రయాలకు సంబంధించి లైసెన్స్ మార్గదర్శ కాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మద్యం దుకాణాల సంఖ్య పెంచకుండానే ఖజానా నింపే ప్రయత్నం చేసింది. గురువారం ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్కుమార్ మార్గదర్శకాలతో కూడిన జీవోలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గతంలో నాలుగు శ్లాబుల్లో ఉన్న లైసెన్స్ ఫీజును ఆరు శ్లాబులుగా నిర్ధారించారు. ఈ ఆరు శ్లాబు ల్లోని నాలుగు శ్లాబుల్లో ఫీజును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచారు. తద్వారా లైసెన్స్ ఫీజు కింద ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరనుంది.
గతంలో ఉన్న టెండర్ ఫీజును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఈ పెంపు ద్వారా కనీసం రూ.400 కోట్ల అదాయం అదనంగా రానుంది. ప్రతి షాపు ఏటా రూ.5 లక్షలు లెవీ కింద చెల్లించాలన్న నిబంధనతో మరో రూ.100 కోట్లకు పైగా రాబడి వస్తుంది. మొత్తం మీద లైసెన్స్ ఫీజులు, దరఖాస్తు ఫీజు, లెవీ, శ్లాబుల పెంపు ద్వారా మొత్తం రూ.2,320 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుందని అంచనా వేస్తున్నారు. ఫీజులు పెంచినా లైసెన్స్ హోల్డర్లకు కొంత వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా దరఖాస్తుతో పాటు ఇవ్వాల్సిన ధరావత్తు తొలగిం చారు. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని గతంలో మూడు వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా, దాన్ని నాలుగు వాయిదాలకు పెంచారు. బ్యాంకు గ్యారంటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో కూడా ఉదారతతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీర్లపై కమీషన్ 25 నుంచి 20 శాతానికి తగ్గించారు.
కొత్త మార్గదర్శకాలు