పుష్కరాల శెలవులు రెండు రోజులు

25 Jul, 2015 17:55 IST|Sakshi

హైదరాబాద్ : ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో గోదావరి పుష్కరాల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వోద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు శెలవు మంజూరు చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ మేరకు పుష్కర విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు సోమవారం, మంగళవారం శెలవులు మంజూరయ్యాయి.

>
మరిన్ని వార్తలు