తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ (వాటర్గ్రిడ్)కు రూ.100 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో నమోదు నిమిత్తం కార్పొరేషన్ పీడీ ఖాతాకు ఈ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ను ప్రభుత్వం ఆదేశించింది.