సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. తెలంగాణ గవర్నర్గా భాద్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆమె మర్యాదపూర్వకంగా రాష్ట్రపతిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర తాజా పరిస్థితులను గవర్నర్ రాష్ట్రపతికి వివరించారు.