'రైతుల కోసం ఫాబ్లెట్ టెక్నాలజీ'

2 Jul, 2015 19:03 IST|Sakshi

హైదరాబాద్: రైతుల కోసం ఇక్రిసాట్తో కలిసి ఫాబ్లెట్ టెక్నాలజీ అందించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ ఫాబ్లెట్లో ఉంటుందని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే 'మీ సేవ' సర్వీసుల కోసం మొబైల్ ఆప్లికేషన్ రూపొందించినట్టు ఆయన చెప్పారు.

 

అదేవిధంగా హైదరాబాద్లో సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు ఇండియన్ గాడ్జెట్ షోలో 300 కంపెనీలు పాల్గొంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు