ఎమ్మెల్సీ కౌంటింగ్‌ రోజున సెలవు

23 Dec, 2015 16:59 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలికి సంబంధించి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆదివారం (27న) జరుగనున్నాయి. ఓట్ల కౌంటింగ్‌ బుధవారం (30న) జరుగనుంది. కౌంటింగ్‌ రోజున సెలవు ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

మరిన్ని వార్తలు