సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. సంఖ్యా బలం పరంగా టీఆర్ఎస్కు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్ల్లో స్పష్టమైన బలం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
శనివారం ఉదయం 9 గంటల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు ప్రారంభయ్యాయి. మధ్యాహ్నం 2 గం. వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరిగిన తర్వాత ఒక్కో పదవికి ఒకటి కంటే ఎక్కువ నా మినేషన్లు వస్తే సాయంత్రం 5 గం. వరకు పోలింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా సీల్డ్ కవర్లు అందుకున్న టీఆర్ఎస్ సహకార ఎన్నికల పరిశీలకులు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వరించిన వారి పేర్లను వెల్లడించారు.
నల్గొండలో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
కరీంనగర్ డీసీసీబీ చైర్మన్గా నామినేషన్ వేస్తున్న కొండూరు రవీందర్రావు
జిల్లాల వారీగా.. సహకార పదవులు పొందినవారు..
దాదాపు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుని సత్తాచాటిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచారు.
ఎన్నికపై అసంతృప్తి..
నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్గా నల్లవెల్లి మోహన్, వైస్ చైర్మన్గా ఇంద్రసేనా రెడ్డి ఎన్నికయ్యారు. అయితే, చైర్మన్ పదవులు ఆశిస్తున్న ఇద్దరు టీఆర్ఎస్ నేతలు, పీఏసీఎస్ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, శ్రీనివాస్గౌడ్ ఈ ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందు నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యం లేదని వాపోయారు.