-

ఎన్నికల హామీని నెరవేర్చిన కేసీఆర్

11 Apr, 2017 19:55 IST|Sakshi
ఎన్నికల హామీని నెరవేర్చిన కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చివరి విడత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది. మంగళవారం 4 వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిధులతో కలిపి తెలంగాణ ప్రభుత్వం మొత్తం 17 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసింది. 2014లో కే చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల హామీ ప్రకారం రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో మూడు విడతలుగా రుణ మాఫీకి నిధులను విడుదల చేశారు. రుణమాఫీ చేయడం వల్ల రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.

మరిన్ని వార్తలు