చిప్‌ సిస్టమ్‌ తొలగించాలి : ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు

18 Apr, 2019 14:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పోలీస్‌​ డిపార్ట్‌మెంట్‌ సెలక్షన్స్‌లో సెన్సార్‌ చిప్‌ సిస్టమ్‌ను తొలగించాలని ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో గురువారమిక్కడ బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఆందోళన నిర్వహించారు. రేడియో ఫ్రిక్వేన్సీ ఐడెంటిఫై(ఆర్‌ఎఫ్‌ఐ) సిస్టం ద్వారా ఈవెంట్స్‌ నిర్వహించడం వలన ఇబ్బందులు తలేత్తాయని వారు ఆరోపించారు. ఈవెంట్స్‌లో సెలక్ట్‌ కాని వారిని కూడా తుది పరీక్షకు అనుమతిచ్చారని తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే క్రిమినల్‌ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు.

మరిన్ని వార్తలు