తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని విడుదల చేసిన కేటీఆర్‌ 

13 Jun, 2020 02:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్‌ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్పకళను గురించి వర్ణించే ఈ పాట బాగుందని కేటీఆర్‌ ప్రశంసించారు. సుబ్బాచారి రచించిన ఈ పాటకు వి.రాధ సంగీతాన్ని సమకూర్చగా ప్రముఖ సినీ నేపథ్య గాయ కులు కృష్ణచైతన్య, కల్పన, హరిణి, సాయిచరణ్‌లు ఆలపించారు. ఈమేరకు శుక్రవారం ప్రగతి భవన్‌లో ప్రియదర్శి తన తల్లిదండ్రులు, శ్రీమతితో కేటీఆర్‌ని కలిశారు. తన తండ్రి రాసిన ఈ పాటను ఆవిష్కరించినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు