నేడే తెలంగాణ ఉద్యమ వేదిక భేటీ

6 May, 2015 02:16 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక తీరును ఎండగట్టడం, ప్రజల హక్కులకు కొత్త గొంతుక వినిపించేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఆవిర్భవించనున్న తెలంగాణ ఉద్యమ వేదిక (టీయూవీ) బుధవారం భేటీ కానుంది. టీయూవీ ద్వారా చేపట్టబోయే కార్యాచరణపై తెలంగాణ మేధావులతో మేధోమథనం చేపట్టనున్నారు.

బుధవారం ఉదయం హిమాయత్‌నగర్‌లోని ప్లాటినం హోటల్‌లో సమావేశం కానున్నారు. తెలంగాణలోని ఉద్యమనేతలు, ప్రజా సంఘాల్లో ముఖ్య నేతలు, వైద్య,పారిశ్రామిక, సామాజిక రంగాల్లో పనిచేస్తున్న వారు ఈ భేటీకి హాజరుకానున్నారు.
 
 

మరిన్ని వార్తలు