సిరిసిల్ల: జిల్లాలోని ముస్తాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇసుక లారీలను నిలిపివేయాలని, రోడ్డు ప్రమాదానికి సంబంధించి అధికార పార్టే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. దీనికి కౌంటర్గా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన గన్నె శంకరయ్య కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా కాంగ్రెస్ పార్టీ చెల్లించాలంటూ రాస్తారోకో నిర్వహించారు. పోటా పోటీ ధర్నాలతో ముస్తాబాద్ అట్టుడుకుతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.