పదో తరగతి ప్రశ్నపత్రాల కారు బోల్తా..

23 Mar, 2017 11:31 IST|Sakshi
పదో తరగతి ప్రశ్నపత్రాల కారు బోల్తా..
ఖమ్మం: పదో తరగతి పరీక్షా పత్రాలు తీసుకెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బాణాపురంలో గురువారం చోటుచేసుకుంది. బాణాపురం పరీక్షా కేంద్రానికి ప్రశ్నపత్రాలు తీసుకెళ్తున్న కారు బోల్తా కొట్టడంతో కారులో ఉన్న కానిస్టేబుల్‌తో పాటు ప్రధానోపాధ్యాయుడికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రశ్నపత్రాలను మరో వాహనంలో కేంద్రానికి తరలించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వార్తలు