నేడు టెట్ ఫలితాలు

8 May, 2014 04:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు టెట్ వెబ్‌సైట్ www.aptet.cgg.gov.inలో ఫలితాలను పొందుపరుస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెట్ ఫైనల్ కీని కూడా విడుదల చేశారు. మార్చి 16న జరిగిన టెట్ పేపర్-1కు 56,546 మంది, పేపర్-2కు 3,39,251 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు పేపర్లు రాసిన అభ్యర్థులు 7 వేల మంది ఉన్నారు.

>
మరిన్ని వార్తలు