మరిది చేతిలో వదిన దారుణ హత్య

7 Jan, 2016 16:11 IST|Sakshi

నవాబుపేట మండలం చిట్టిగిడ్డ గ్రామంలో పద్మమ్మ(35) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి తన సొంత వదినను గొడ్డలితో నరికి చంపాడు. హత్య అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు