మద్యం మత్తులో దారుణ హత్య

9 Dec, 2015 19:19 IST|Sakshi

మద్యం మత్తులో జరిగిన గొడవ చివరికి ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఖమ్మం జిల్లా పినపాక మండలం పరిధిలోని వలసగుత్తికోయ గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వలసవచ్చిన వారు పద్మాపురం పంచాయతీ పరిధిలో అటవీ ప్రాంతంలో ఓ గుట్టపై నివాసం ఉంటున్నారు.

వీరిలో సోడి జోగయ్య (60), మడకం ముఖేష్‌లు మద్యం సేవించి గొడవపడ్డారు. ఆగ్రహంతో ముఖేష్ గొడ్డలితో జోగయ్య తలపై నరికాడు. ఈ ఘటనలో జోగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు