-

కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

18 Oct, 2015 18:10 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లి తండా వద్ద ఆదివారం కారు ఢీ కొనడంతో ఓ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మేకవనంపల్లి గ్రామానికి చెందిన కోటపల్లి రమేష్, ప్రశాంత్‌లు బైక్‌పై సదాశివపేటకు వెళ్తుండగా, తండా సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో రమేష్‌కు తీవ్ర గాయాలు కాగా, అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు