కారు ఢీకొని బాలుని మృతి

1 Mar, 2016 14:35 IST|Sakshi

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చెన్నంపల్లి శివారులో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. వసలకార్మికుల కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని వివరాలు తెలియరాలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు