లాంఛనమే

15 Mar, 2016 03:29 IST|Sakshi

నేడు అచ్చంపేట నగర పంచాయతీ
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
మొదట కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
చైర్మన్‌గా తులసీరాం, వైస్ చైర్మన్‌గా విశ్వేశ్వర్‌నాథ్!
సాయంత్రం అభినందన సభ

 
 
 అచ్చంపేట : అచ్చంపేట నగర పంచాయతీ తొలి పాలకవర్గం మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. గెలుపొందిన కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. అయితే మొత్తం 20 వార్డులకు అందరూ టీఆర్‌ఎస్ సభ్యులే గెలవడంతో అనుకున్న విధంగానే చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కౌన్సిలర్లు సకాలంలో హాజరుకావాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నాగర్‌కర్నూల్ ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి కోరారు. చైర్మన్‌గా కె.తులసీరాం, వైస్ చైర్మన్‌గా విశ్వేశ్వర్‌నాథ్అచ్చంపేట ‘నగర’పోరులో టీఆర్‌ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఎవరి ఊహకంద ని రీతిలో పట్టణ ప్రజలు 20వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను బలపరుస్తూ తీర్పునిచ్చారు.

టీఆర్‌ఎస్ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ఒకతాటిపైకి వచ్చి కూటమిగా ఏర్పడి  పోటీ చేసినా ఒకవార్డును కూడా గెలచుకోలేకపోయారు. 3వవార్డు నుంచి గెలుపొందిన కె.తులసీరాం మొదటినుంచి చైర్మన్ అభ్యర్థిగా ఉన్నారు. అదే విధంగా విశ్వేశ్వర్‌నాథ్ 19వ వార్డునుంచి విజయం సాధించారు. అనుకున్నట్టుగా తులసీరాం చైర్మన్‌గా, వైస్‌చైర్మన్‌గా విశ్వేశ్వర్‌నాథ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు మరికొంత మంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. చైర్మన్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం అనంతరం సాయంత్రం స్థానిక కుమారస్వామి రైస్‌మిల్లు ఆవరణలో అభినందన సభ జరగనుంది.

మరిన్ని వార్తలు