భవనం పై నుంచి పడి వ్యక్తి మృతి

29 Oct, 2015 16:25 IST|Sakshi

గోదాంపై రేకులు సవరిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం పంచాయతి పరిధిలోని కొత్తూరులో గురువారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..  గ్రామానికి చెందిన కృష్ణ(44) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గోదాంలో రేకులు సవరిస్తుండగా.. కాలు జారి కింద పడ్డాడు.. తీవ్రగాయాలు అయిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు