పొలంలోనే ప్రాణాలు తీసుకున్న రైతు

24 Oct, 2015 10:26 IST|Sakshi

నల్లగొండ జిల్లా దిండి మండలం గోనకల్ గ్రామంలో ఓ రైతు అప్పుల బాధ ఎక్కువై పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. గంగిరెడ్డి(45) అనే రైతుకు మూడెకరాల పొలం ఉంది. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. అయితే, సాగు పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, చేసిన అప్పులు రూ.4 లక్షలకు చేరుకోవడంతో మనస్తాపం చెందాడు. శుక్రవారం రాత్రి పొలంలో పురుగుల ముందు తాగి ప్రాణలు కోల్పోయాడు.

మరిన్ని వార్తలు