అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

31 Dec, 2015 11:54 IST|Sakshi

నల్లగొండ జిల్లా హాలియా మండలం అనుములకు చెందిన ఓ పత్తి రైతు అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన కృష్ణయ్య(60) తనకున్న ఆరెకరాల్లో పత్తి సాగు చేశాడు. అయితే, ఈ ఏడాది పత్తి దిగుబడులు సరిగ్గా రాలేదు. పెపైచ్చు మంచిధర కూడా లభించకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాదాపు రూ.5 ల క్షల వరకు అప్పులున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని తనువు చాలించాడు.



 

మరిన్ని వార్తలు