కీసరగుట్టలో హైకోర్టు జస్టిస్ పూజలు

14 Nov, 2015 19:10 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వరస్వామిని శనివారం హైకోర్టు జస్టిస్ ఎన్.రాంమోహన్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం దేవాలయానికి వచ్చిన జస్టిస్ కుటుంబ సభ్యులకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం ఫలికారు. స్వామికి అభిషేక సేవ అనంతరం వారిని వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ ఈవో జస్టిస్ ఎన్ రామోహన్ రావు జ్ఞాపికను అందించారు.


 

మరిన్ని వార్తలు