వివాహిత అనుమానాస్పద మృతి

24 Mar, 2016 13:10 IST|Sakshi

వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన మెదక్ పట్టణంలో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మానస(30) ఇంట్లో ఎవరు లేని సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు మానస బంధువులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తే.. ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు