విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి

2 Dec, 2015 13:02 IST|Sakshi

కొత్త ఇంటి నిర్మాణం కోసం ఢాబా పై ఇనుప కడ్డీలు వేస్తున్న వ్యక్తి విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన గోపాల్(42) కొత్త ఇంటి నిర్మాణం నిమిత్తం ఇప్పుడు ఉన్న ఇంటిపై ఇనుప కడ్డీలు వేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇనుప చువ్వలు ఇంటి పక్కగా పోతున్న విద్యుత్ తీగలకు తాకడంతో.. విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



 

మరిన్ని వార్తలు